సమ్మోహనంతో తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహనం చేసిన సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే. టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. సినిమా కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉండడం… హీరో, హీరోయిన్ పెర్ ఫార్మెన్స్ ఫ్రెష్ గా అనిపించింది. ఆఫీస్ మొత్తం భయపడే సాఫ్ట్ వేర్ కంపెనీ మేనేజర్ గా సుధీర్బాబు నటించగా.. అల్లరి చేసే గడుసమ్మాయి సిరి పాత్రలో హీరోయిన్ నభా నటేశ్ కనిపించింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రెడీ అవుతున్న ఈ చిత్రాన్నిఈ నెల 21న ప్రంపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీలోని నిజంగా.. కొత్తగా సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. భాస్కరభట్ల రాసిన ఈ గీతాన్ని హర్షికా దేవనాథన్ ఆలపించింది. మూవీకి అంజనీష్ లోక్ నాథ్ సంగీతం సమకూర్చాడు.