సీనియర్ నటి కాజల్ మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150, ఆ తర్వాత వచ్చిన నేనే రాజు నేనే మంత్రి మూవీల తర్వాత ఆమె మరింత జోరు పెంచింది.. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రంతో పాటు తమిళ క్వీన్ రీమేక్ లో నటిస్తున్నది. అలాగే తేజ దర్శకత్వం వహించనున్న తర్వాత మూవీలో కూడా కాజల్ హీరోయిన్. ఈ మూడు చేతిలో ఉండగానే ఒక లేడి ఓరియెంటెడ్ మూవీకి సైన్ చేసింది.. అర్ధనారి మూవీ దర్శకుడు బాను శంకర్ ఇటీవల కాజల్ ను కలసి కథ వినిపించాడు.. హీరోయిన్ ప్రాధాన్య కథ కావడంతో వెంటేనే ఓకే చెప్పింది కాజల్.. దీంతో ఆ దర్శకుడు పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు.