సక్సెస్ ఫుల్ గా సినీ కెరీర్ ను కొనసాగిస్తోన్న తమన్నా త్వరలోనే కొత్త బిజినెస్ ను ప్రారంభించబోతోంది. సినిమాల ద్వారా తాను సంపాదించిన మొత్తాన్ని ఈ బిజినెస్ లో పెట్టబోతోంది. తన పేరుతోనే వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించనుంది.'తమన్నా డైమండ్ జువెలరీ' బ్రాండ్ పేరుతో ఈ బిజినెస్ చేయబోతోంది. ఈ క్రమంలో, డైమండ్ బిజినెస్ లో అడుగుపెట్టిన తొలి దక్షిణాది హీరోయిన్ గా తమన్నా రికార్డ్ సృష్టించబోతోంది. బాలీవుడ్ లో ఇప్పటికే కరీనాకపూర్, కత్రినాకైఫ్ లాంటి నటీమణులు వజ్రాల వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు. అయితే, సొంత బ్రాండ్ లపై వారు వ్యాపారాలు చేయడం లేదు.