డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం "లైగర్". ఇందులో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను ప్రఖ్యాత బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి పూరి జగన్నాధ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, లైగర్ మూవీని ఓవర్సీస్ లో రిలీజ్ చెయ్యడానికి సరిగమ సినిమాస్ ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. 2022లో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లుగా నిలిచిన RRR, KGF 2 చిత్రాలు కూడా సరిగమ సినిమాస్ సంస్థ ద్వారానే ఓవర్సీస్ లో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు లైగర్ కూడా ఇదే సంస్థ ద్వారా విదేశాల్లో విడుదల కాబోతుండడంతో, ఈ సినిమా కూడా ఆ స్థాయి హిట్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.