అన్న ఎన్టీఆర్ బయోపిక్ ను దర్శకుడు క్రిష్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. బాలకృష్ణ ఎన్టీఆర్ లా నటిస్తున్నారు. ఈ సినిమా తొలి భాగం వచ్చే ఏడాది జనవరి 9న, రెండో భాగం జనవరి 24న విడుదల కానుంది. మొదటి విభాగానికి ‘కథానాయకుడు’ అని, రెండో విభాగానికి ‘మహానాయకుడు’ అనే టైటిల్స్ను ఖరారు చేశారు. తాజా ఈ చిత్రంలో ఎపి సి ఎం చంద్రబాబు నాయుడు భార్యగా మలయాళం నటి మంజిమా మోహన్ ను ఎంపిక చేశారు..చంద్రబాబుగా రానా నటిస్తున్నాడు..ఈ వారంలో హైదరాబాద్ అబిడ్స్ లోని ఎన్టీఆర్ నివాసంలో షూటింగ్ జరపనున్నారు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యా బాలన్, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్ , హెచ్ఎమ్ రెడ్డి గా సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి , ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరిగా హిమాన్సీ నటిస్తున్నారు. ఇక శ్రీదేవి పాత్రలో రకుల్, జయప్రద పాత్రలో తమన్నా మెరవనున్నారు. ఎస్వీఆర్ పాత్ర లో మెగా బ్రదర్ నాగబాబు కనిపించనున్నాడు.. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.