ఇండియా అంతటా ఇప్పుడు మీటూ ఉద్యమం ఉప్పెనలా మారింది. సినీ సెలబ్రిటీలతో పాటు ప్రముఖుల బారిన పడ్డ మహిళలు ధైర్యంగా బయటకి వచ్చి వారు ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి #మీటూ ద్వారా సోషల్ మీడియాలో ప్రజలకి తెలియజేస్తున్నారు. ఈ ఉద్యమంపై బాలీవుడ్ తారలతో పాటు టాలీవుడ్ తారలు కూడా తమ స్పందన తెలియజేశారు. కొందరు ఈ ఉద్యమానికి తమ మద్దతు తెలియజేశారు. తాజాగా ఢిల్లీలో జరిగిన లోటస్ మ్యాకప్ ఇండియా ఫ్యాషన్ వీక్లో పాల్గొన్న బాలీవుడ్ హీరోయిన్ సుస్మితా సేన్ తన వాదనని వినిపించారు. మీటూ ఉద్యమాన్ని ఇతర దేశాల నుండి కాపీ కొట్టాం. అయిన ఇది పట్టించుకునే విషయం కాదు. మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి, తమకి ఎదురైన సంఘటనల గురించి బహిరంగంగా చెప్పడం గ్రేట్ అనిపిస్తోంది. సమాజంలో భాగంగా మనమందరం వారు చెప్పే విషయాలని వినాలి. తప్పా, కాదా అనేది మనం నిర్ణయించకూడదు. అలాగని వారిని పట్టించుకోకుండా ఉండకుండా ప్రోత్సహించే పనులు చేయాలి. అప్పుడే వారు చేస్తున్న ఉద్యమానికి సార్థకత లభిస్తుంది. లేదంటే అదంతా వృధా అవుతుందని సుస్మితా సేన్ స్పష్టం చేశారు.