ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్ అర‌వింద‌కు రాజ‌మౌళి ప్ర‌శంస‌లు

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 13, 2018, 01:59 PM



యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ‘అరవింద సమేత’. ఈ చిత్రం గురువారం నాడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆటతోనే ఈ సినిమా మంచి సక్సెస్ టాక్‌ను సంపాదించుకుంది. భారీ డైలాగులు, హాస్యాన్ని పక్కనబెట్టి తొలిసారి త్రివిక్రమ్ కథనే నమ్మి చేసిన ప్రయత్నానికి ప్రేక్షకుల ఆద‌ర‌ణ ల‌భిస్తున్న‌ది. తాజాగా ఈ మూవీని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి వీక్షించాడు.. అనంత‌రం ట్విట్టర్ లో చిత్ర యూనిట్ ను ప్ర‌శంసిస్తూ ట్విట్ చేశాడు. ‘‘ఒక యుద్ధం ముగిసిన తరువాత ఒక ప్లాట్ పాయింట్‌తో సినిమాను నడిపించడమనేది త్రివిక్రమ్ తీసుకున్న సాహసమైన నిర్ణయమనే చెప్పాలి. అది చాలా బాగా వర్కవుట్ అయింది. ఆ సీన్‌లో తారక్ నటన చాలా కాలం గుర్తుండిపోతుంది. జగపతి బాబు గారి నటన అద్భుతం. అరవింద సమేత టీం మొత్తానికి శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com