మాస్ మహరాజా రవితేజ దర్శకుడు శ్రీను వైట్లతో ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నది…ఈ మూవీ తర్వాత దర్శకుడు వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేయనున్నాడు. దర్శకుడు ‘టైమ్ మిషన్’ నేపథ్యంలోని కథను సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం. గతంలో టైమ్ మిషన్ నేపథ్యంలో ‘ఆదిత్య 369’ సినిమా రిలీజై హిట్ కొట్టింది. అదే తరహా కథను సరికొత్త పంధాలో తీయనున్నారు.. ఈ మూవీలో హీరోయిన్ గా నభా నటేష్ ను ఎంపిక చేశారు..డిసెంబర్ లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.