మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ మసాలా మూవీ చేస్తున్నాడు.. ఇటీవలే ఈ మూవీ విదేశాలల్లో షూటింగ్ జరుపుకుంది.. తన తదుపరి షెడ్యూల్ షూటింగ్ కోసం విశాఖపట్నం చిత్ర యూనిట్ చేరుకుంది.. ముందుగా ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారిని రాంచరణ్, బోయపాటి శ్రీను, నిర్మాత డీవీవీ దానయ్యలు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి సాదర స్వాగతం పలికారు. ఆలయంలో కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా మండప ప్రదక్షిణ చేశారు. పూజానంతరం ఆలయ అధికారులు స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలను వారికి అందించారు. కాగా ఈ మూవీ షూటింగ్ రేపటి నుంచి సింహచలంలో ప్రారంభమవుతుంది.. ఈ మూవీలో కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్నది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు