బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హాలు తనపై అత్యాచారం చేశారంటూ హిందీ బిగ్ బాస్ రియల్టీ షో పార్టిసిపెంట్ పూజా మిశ్రా అరోపించింది.. మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాను ఆమె బహిరంగంగా వెల్లడించింది. బిగ్ బాస్ సీజన్ కు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ సమయంలోనే సల్మాన్ వేధించాడని తెలిపింది. ఇక క సల్మాన్ నటించిన సుల్తాన్ చిత్ర షూటింగ్ సమయంలో నాపై సల్మాన్ ఖాన్ అత్యంత క్రూరంగా అత్యాచారం చేసాడని సంచలన ఆరోపణలు చేసింది . అంతేకాదు సల్మాన్ ఖాన్ ఒక్కడు మాత్రమే కాదని అతడి సోదరులైన అర్భాజ్ ఖాన్ , సోహైల్ ఖాన్ లు కూడా నన్ను వేధించారని కుండ బద్దలు కొట్టింది. అలాగే , సీనియర్ నటుడు శత్రుఘ్ను సిన్హా సైతం నన్ను రేప్ చేసాడని చెప్పింది. బహిరంగంగా జరిగిన విషయాలను బయటపెట్టడం వల్ల సల్మాన్ ఖాన్ వల్ల అలాగే అతడి సోదరుల వల్ల నాకు ప్రాణహాని ఉందని పేర్కొంది.. ఇప్పటికే తన తండ్రిని చంపివేస్తామంటూ హెచ్చరికలు వచ్చాయని తెలిపింది.తనకు, తన కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని కోరింది.. తనపై అత్యాచారం చేసిన వారిని న్యాయపరంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. కాగా ఈ ప్రెస్ మీట్ ను పలు ఛానల్స్ ప్రసారం చేశాయి.. ఇటువంటి చెత్త ఆరోపణలు చేసిన పూజా మిశ్రా వీడియో వెర్షన్ ను వెంటనే తొలగించాలని కోరురూ సల్మాన్ కు చెందిన కొందరు ప్రతినిధులు ఆయా ఛానల్స్ ను హెచ్చరించారు.. లేనట్లయితే చట్టపర చర్యలకు సిద్దం కావాలని వార్నింగ్ ఇచ్చారు.