ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ క్యాంబోలో వచ్చిన మూవీ అరవింద సమేత.. ఈ మూవీ ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ కొట్టింది..ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్. అయితే మరో హీరోయిన్ గా ఈషా రెబ్బా నటించింది.. టాప్ డైరెక్టర్, టాప్ హీరో సరసన ఛాన్స్ రావడంతోఈషా చాలా ఆనందపడింది.. అలాగే త్రివిక్రమ్ ఈ మూవీలో ఈషాపై చాలా సీన్స్ షూట్ చేశారు.. నిడివి కారణంగా ఆమె పాత్రలను నాలుగైదు సీన్స్ కు మాత్రమే పరిమితం చేశారు.. మూవీలో కేవలం ఆమె అతిథి పాత్రలో మాత్రమే కనిపించింది..ఆ మూవీ చూసి తన పాత్ర నిడివి తగ్గిపోవడంతో పూర్తి నిరాశలో కూరుకుపోయింది ఈషా