సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ 27వ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఒక హీరోయిన్గా హలో ఫేమ్ కల్యాణి ప్రియదర్శన్ నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ షూటింగ్ పూర్తైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది కల్యాణి ప్రియదర్శన్.
‘‘శర్వానంద్ 27వ చిత్రంలో నా షూటింగ్ పూర్తైంది. శర్వా, సినిమాటోగ్రాఫర్ దివాకర్ మణి, చిత్ర యూనిట్ మొత్తానికి థ్యాంక్స్. గన్ను ఎలా షూట్ చేయాలో నేర్పించిన, అలాగే ఈ చిత్రంలో నాకు గీత పాత్రను ఇచ్చిన దర్శకుడు సుధీర్ వర్మకు స్పెషల్ థ్యాంక్స్. స్క్రీన్ మీద గీతను కలిసేందుకు చాలా ఎదురుచూస్తున్నా’’ అంటూ తెలిపింది కల్యాణి ప్రియదర్శన్.