దర్శకధీరుడు రాజమౌళి.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో భారీ మల్టీస్టారర్ ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకొంది. కథ ప్రకారం సినిమాలో ముగ్గురు హీరోయిన్లకు అవకాశం ఉందట. అందులో ఇద్దరు ఇక్కడి అమ్మాయిలు కాగా ఒక హీరోయిన్ గా మాత్రం విదేశీ అమ్మాయిని తీసుకోబోతున్నారని సమాచారం. అందులో ఇద్దరు ఇక్కడి అమ్మాయిలు కాగా ఒక హీరోయిన్ గా మాత్రం విదేశీ అమ్మాయిని తీసుకోబోతున్నారని సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికని తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 'ఛలో' చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన రష్మిక 'గీత గోవిందం' సినిమాతో సక్సెస్ అందుకుంది.'దేవదాస్' సినిమాలో కూడా అలరించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు రాజమౌళి దృష్టి రష్మిక మీద పడిందని అంటున్నారు. రామ్ చరణ్ పక్కన రష్మిక ఎలా ఉంటుందా..? అనే ఆలోచనలు మొదలయ్యాయి. అయితే దీనిపై ఎలాంటి అధికార ప్రకటన లేదు.