‘సర్కార్’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ను తన ఖాతాలో వేసుకున్న దళపతి విజయ్ తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ అట్లీతో చేసేందుకు సిద్ధమవుతున్నాడు. గతంలో అట్లీతో చేసిన ‘తెరి, మెర్సల్’ మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో మూడో సినిమాకు ఈ కాంబో సిద్ధమవుతోంది. అయితే ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్ రోల్లో సమంత, నయనతార కనిపించనున్నారని తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది. ఈ ఇద్దరు హీరోయిన్లూ గతంలో విజయ్తో కలిసి నటించి మంచి విజయాన్ని సాధించారు. ఈ సినిమా కోసం అట్లీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. అన్నీ ఓకే అయితే ఈ చిత్రం సంక్రాంతికి లాంచ్ కానుందని సమాచారం.