తెలుగు సినీ హాస్యనటుడు వేణుమాధవ్ కోదాడ నియోజక వర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా గురువారం నామినేషన్ వేశారు కోదాడలోని ఎన్నికల అధికారిని కలిసిన వేణుమాధవ్ ముహూర్తం చూసుకొని నామినేషన్ పత్రాలు అందజేశారు. తన పుట్టిన వూరు ఋణం తీర్చుకోవడానికి, తన వూరు ప్రజలందరికి మంచిపనులు చేసేందుకే రాజకీయాలలోకి వస్తున్నట్లు వెల్లడించారు. ఈ నటుడి స్వస్థలం కోదాడ. తాను ఇక్కడనే విద్యాబ్యాసం పూర్తిచేసి, మిమిక్రి ఆర్టిస్ట్ గా జీవితాన్ని ప్రారంభించాడు. అనంతరం ఎన్టీఆర్ గారు టీడీపీ ని స్థాపించిన తరువాత, ఆ పార్టీ సభలలో పాల్గొని మిమిక్రీలు చేసేవారు. ఆలా పార్టీ మీటింగ్ లలో పాల్గొన్న వేణుమాధవ్ తన మిమిక్రి ద్వారా ప్రచార కార్యక్రమాలని చేపట్టారు. తరువాత తనకి సినిమాల్లో అవకాశాలు రావడంతో సినీరంగం వైపు వెళ్లి హాస్యనటుడిగా వందలాది చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కొంత కాలంగా అతడికి మూవీలు లేకపోవడంతో క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టి కోదాడ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు