మహర్షి సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్నది. యూఎస్ షెడ్యూల్ ముగించుకొని ఇండియాకు తిరిగి వచ్చిన మహేష్ అండ్ కో కు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణను హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు. మహర్షి ఇంటర్వెల్ సీన్స్ కు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేస్తున్నట్టుగా సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ 5 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. మహేష్ జోడిగా పూజా హెగ్డే నటిస్తున్నది. అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. దిల్ రాజు, సి అశ్విని దత్, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశి పైడిపల్లి దర్శకుడు.