తమిళనాడు ఐరన్ లేడీగా, అమ్మగా, పురుచ్చతలైవీగా తమిళ తంబీలతో పిలిపించుకున్న జయలలిత గత ఏడాది అనారోగ్యం కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. జయలలిత జీవితం ఎందరికో ఆదర్శం అని ఆమెపై సినిమా తీయాలని పలువురు దర్శక నిర్మాతలు భావించారు. ఏ.ఎల్. విజయ్, ప్రియదర్శిని, భారతీ రాజా, వైబ్రీ మీడియా,ఆదిత్య భరద్వాజ్ తదితరులు కొన్నాళ్ళుగా బయోపిక్ స్క్రిప్ట్ని రూపొందించే పనిలో ఉన్నారు. అయితే తమిళ దర్శకురాలు ప్రియదర్శిని ముందుగా తాను తెరకెక్కించనున్న బయోపిక్ టైటిల్ పోస్టర్ని ఆ మధ్య మురుగదాస్ చేతుల మీదుగా విడుదల చేయించింది.
‘ది ఐరన్ లేడీ’ అనే టైటిల్ తో రానున్న ఈచిత్రంలో యువ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ జయలలిత పాత్రలో నటించనుందని అన్నారు. కాని తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ని బట్టి చూస్తుంటే చిత్రంలో లీడ్ రోల్ నిత్యామీనన్ పోషిస్తున్నట్టు అర్ధమవుతుంది. జయలలిత వర్థంతి( డిసెంబర్ 5,2016) సందర్భంగా చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో నిత్యామీనన్ అచ్చం జయలలిత లుక్లో కనిపిస్తుంది. పేపర్ టేల్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈచిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకున్నట్టు తెలుస్తుంది . ఇక విష్ణు ఇందూరి నిర్మాణంలో ఏఎల్ విజయ్ కూడా జయలలిత బయోపిక్ తెరకెక్కిస్తాడని అంటున్నారు. మరో వైపు తమిళ దర్శకుడు భారతీరాజా.. జయలలిత పాత్రలో ఐశ్వర్యారాయ్ని కానీ... అనుష్కను నటింపజేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు భారతీ రాజా ప్రయత్నిస్తున్నారు.