నట సింహ నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ మూవీలోని రాజర్షి సాంగ్ ను నేటి సాయంత్రం రిలీజ్ కానుంది.. ఈ మూవీకి ఎం ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నాడు.. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు కాగా రెండో భాగం ఎన్టీఆర్ మహానాయకుడు . ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని 2019 జనవరి 9 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ మూవీలో బాలయ్య తో పాటు విద్యాబాలన్ , రానా , నందమూరి కళ్యాణ్ రామ్ , నిత్యా మీనన్ , రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటిస్తున్నారు.