నట సింహ నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ మూవీ తొలిభాగం కథానాయకుడు ట్రైలర్ ను ఈ నెల 16న హైదరాబాద్ లో, 21న నిమ్మకూరులో ఆడియోను విడుదల చేయనున్నారు. ఈ రెండు వేడుకలకు చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు కాగా రెండో భాగం ఎన్టీఆర్ మహానాయకుడు . ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని 2019 జనవరి 9 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ మూవీలో బాలయ్య తో పాటు విద్యాబాలన్ , రానా , నందమూరి కళ్యాణ్ రామ్ , నిత్యా మీనన్ , రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటిస్తున్నారు.