అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్పుల్ ఎంటర్టైనర్ ‘మిస్టర్ మజ్ను’. ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే కానుకగా ఒకరోజు ముందు జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ మూవీలోని ఏమైందో సాంగ్ ను రేపు చిత్ర యూనిట్ విడుదల చేయనుంది.ఈ చిత్రానికి సంగీతం: థమన్, పాటలు: శ్రీమణి, సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: అవినాష్ కొల్లా, కొరియోగ్రఫీ: శేఖర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వంల: వెంకీ అట్లూరి.