తొలి సినిమా 'కొత్త బంగారు లోకం'తోనే తెలుగు ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్న హీరోయిన్ శ్వేతా బసు. ఆ సినిమా తరవాత తెలుగులో కొన్ని సినిమాలు చేసిన ఈమె ప్రస్తుతం హిందీ టీవీ సీరియళ్ళలో బిజీగా ఉంది. ఈమె కొంత కాలంగా ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. నిన్న గురువారం రాత్రి వీరి వివాహం పూణేలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు.