హీరోయిన్లు అంటే కేవలం వచ్చిన రెమ్యునరేషన్ తీసుకుని.. సినిమా ప్రమోషన్ చేసుకుని.. అవసరం అనుకున్నపుడు అందాలు ఆరబోసి వెళ్లడం కాదు. అవసరం అనుకున్నపుడు సమాజం కోసం కూడా కొన్ని మంచి పనులు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రష్మిక మందన్న ఇదే చేసింది. నీటి పరిరక్షణ కోసం అండర్ వాటర్ ఫోటోషూట్ చేసి అందర్లోనూ అవగాహన తెప్పించింది.
అలాగే ఇప్పుడు రష్మిక మందన్న కూడా ఇదే చేసింది. ఈ భామ చేసిన ఓ పని ఇప్పుడు అందరి చేత ప్రశంసలు అందుకునేలా చేస్తుంది.ఇప్పుడున్న సమాజంలో ఎంత కాలుష్యం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడున్న సమాజంలో ఎంత కాలుష్యం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు దీనిపై అవగాహన తెచ్చేందుకు రష్మిక మందన్న నడుం బిగించింది. నీటి కాలుష్యంపై అవగాహన కోసం కర్ణాటకలోని అతి పెద్ద చెరువైన బెళ్లందూర్లో అండర్ వాటర్ వెళ్లి ఫొటో షూట్ చేసింది. ఇప్పుడు ఇది బాగా వైరల్ అవుతుంది.ఇలాంటి చోట ఉండాలని నేనైతే అనుకోను. మీతో పంచుకోవాలి అనిపించి చెబుతున్తా.. కచ్చితంగా మన నీటిని మనమే పరిశుభ్రంగా మారుద్దాం అంటూ ట్వీట్ చేసింది రష్మిక.