బాలీవుడ్ నటుడు ఆదిత్య పాంచోలీపై కేసు నమోదైంది. కారు రిపేర్ చేయించుకుని బిల్లు కట్టలేదని ఓ మెకానిక్ ఆయనపై ఫిర్యాదు చేశారు. వివరాల్లోకెళితే.. 2017 మార్చిలో ఆదిత్య తన కారును సర్వీసింగ్కు ఇచ్చారు. దీనికి అయిన బిల్లు రూ.2.82 లక్షలు. అయితే ఆదిత్య బిల్లు చెల్లించలేదు. అప్పటినుంచి మోసిన్ ఖాదర్ అనే మెకానిక్ ఆయనకు పలుమార్లు ఫోన్లు చేశారు. ఒకరోజు మోసిన్ నేరుగా ఆయన నివాసానికి వెళ్లారు. దాంతో ఆదిత్య మోసిన్ను నోటికొచ్చినట్లు తిట్టి బెదిరించారట. ఈ నేపథ్యంలో మోసిన్ వర్సోవా పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్పీ రవీంద్ర వెల్లడించారు.