మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిన మూవీ యాత్ర.. ఈ మూవీ ఫిబ్రవరి 8వ తేదిన ప్రేక్షకుల ముందుకురానుంది.. వైఎస్సార్ పాత్రలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి నటించాడు. మహి వి రాఘవ్ దర్శకుడు.. ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుంది.. ఒక్క కట్ లేకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డ్ ఇచ్చింది.