దేశంలోని అన్ని భాషల చలన చిత్ర పరిశ్రమల్లో బయోపిక్ల హవా కొనసాగుతోంది. సినీ రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్యుల జీవితాలను కూడా తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ నేపథ్యంలో ఇటీవల ఝాన్సీ లక్ష్మిబాయి బయోపిక్లో నటించి, కొంత భాగం దర్శకత్వం కూడా వహించిన బాలీవుడ్ అగ్ర నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ జాతీయ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన బయోపిక్ను తానె తీసుకుంటానని వెల్లడించింది. తన గురించి తనకే పూర్తిగా తెలుసని, అలాగే ఇతరులైతే అన్ని నిజాలే చూపిస్తారని నమ్మకం లేదని తెలిపింది. తనకు అత్యంత సన్నిహితులైన వారి గురించి సినిమాలో ప్రస్తావిస్తానని తెలిపింది. అలాగే సినీ రంగంలో తనను మోసం చేసిన వారి ప్రస్తావ కూడా ఉంటుందని తెలిపింది. కానీ, ఎవ్వరి పేర్లను బయటపెట్టానని తెలిపింది.
కంగనా జీవితంలో చాలా వివాదాలు ఉన్నాయి. గతంలో బాలీవుడ్ నటుడు హ్రితిక్ రోషన్తో జరిగిన వివాదం అందరికీ తెలిసిందే. అలాగే తాజాగా దర్శకుడు క్రిష్తో కూడా ఓ వివాదం జరిగింది. ఇలాంటి వివాదాలు ఎన్నో కంగనా జీవితంలో ఉన్నాయి. అలాగే నటనలో రెండుసార్లు జాతీయ పురస్కారాలు అందుకున్న చరిత్ర కూడా కంగనాకు ఉంది. దీనితో కంగనా జీవితం బయోపిక్కు సరిపోతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల అగ్ర రచయితా విజయేంద్ర ప్రసాద్ తనపై పుస్తకం రాస్తానని చెప్పాడని ఆమె తెలిపింది. విజయేంద్ర ప్రసాద్ అగ్ర రచయిత కనుక తాను అయితే అన్ని నిజాలే రాస్తాడని నమ్ముతున్నానని అందుకే తనపై పుస్తకం రాయడానికి ఒకే చెప్పినట్టు తెలిపింది. అలాగే విజయేంద్ర ప్రసాద్ తన బయోపిక్ కథ అందిస్తాడని తెలిపింది. మొత్తానికి సినీరంగంతో సంబంధం లేని ఓ చిన్న ప్రాంతానికి చెందిన అమ్మాయి బాలీవుడ్లో ఎలా అగ్ర కథానాయికగా ఎదిగింది అన్న విషయంపై నా బయోపిక్ ఉండబోతోందని కంగన తెలిపింది.