ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విక్రమ్ 'తంగలన్' గురించిన తాజా అప్‌డేట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2023, 05:22 PM



దర్శకుడు పా రంజిత్‌తో స్టార్ హీరో విక్రమ్ 'తంగలన్' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ మరియు పార్వతి తిరువోతు కథానాయికలుగా నటిస్తున్నారు.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా తంగలన్ యొక్క షూటింగ్‌ జూన్ 15 లేదా 17న షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ 2 వారాల సుదీర్ఘ షెడ్యూల్‌లో చియాన్ విక్రమ్ మరియు ఇతర ప్రధాన నటీనటులు సెట్స్‌లో చేరనున్నారు.

ఈ సినిమాలో డేనియల్ కాల్టాగిరోన్, పశుపతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com