ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాలే.. ఇక్కడెందుకురా ఉన్నావ్.. పాక్‌కు పో : రష్మీ ఫైర్

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 16, 2019, 03:31 PM



పుల్వామా ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో దేశం యావ‌త్తు పాకిస్తాన్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. పాకిస్థాన్‌పై మ‌రోసారి స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేయాల‌ని, పుల్వామా దాడికి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని సోష‌ల్ మీడియా ద్వారా నెటిజ‌న్లంద‌రూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో భార‌త్‌లోనే ఉంటూ పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యాఖ్య‌లు చేస్తున్న వారిపై కూడా ఆగ్ర‌హం క‌ట్టలు తెచ్చుకుంటోంది. మాజీ క్రికెట‌ర్ సిద్ధు `ఉగ్ర‌వాదానికి దేశంతోనూ, మ‌తంతోనూ సంబంధం లేద‌`ని చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం లేపాయి. అలాగే కొంద‌రు యువ‌కులు కూడా సోషల్ మీడియా వేదిక‌గా పాక్‌కు అనుకూలంగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు.


 ఈ వ్యాఖ్య‌ల‌పై యాంక‌ర్ ర‌ష్మి తీవ్ర అగ్ర‌హం వ్య‌క్తం చేసింది. `పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్న సిద్ధు.. దేశ విభ‌జ‌న స‌మ‌యంలోనే పాకిస్థాన్‌కు వెళ్లిపోవాల్సింది. దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఆయ‌న ఇప్ప‌టికీ ఈ దేశంలోనే ఉన్నాడ‌`ని వ్యాఖ్యానించింది. అలాగే `పాకిస్థాన్ ఆర్మీ జిందాబాద్‌` అంటూ షోయెబ్ హ‌ఫీజ్ అనే నెటిజ‌న్ ట్వీట్‌కు స్పందిస్తూ.. `సాలే.. ఏంట్రా నీ పాకిస్థాన్ గొప్ప‌త‌నం? మాతోనే నీకు అస్థిత్వం. దేశ వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేయ‌డానికి సిగ్గు లేదా? మూసుకుని కూర్చో. లేక‌పోతే పాకిస్తాన్ వెళ్లిపో` అంటూ ఘాటుగా స్పందించింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com