నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ ను కొద్దీ సేపటి క్రితం విడుదలచేశారు. ఇక ట్రైలర్ చూస్తుంటే సినిమాలో ఈసారి ఎమోషనల్ కంటెంట్ గట్టిగానే వునట్లుగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ తో పాటు రానా పాత్ర ఈ చిత్రంలో హైలైట్ కానుంది. మొత్తానికి ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. ఇక ఈచిత్రంలో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది అనే విషయాలను ఈ చిత్రంలో చూపించనున్నారు.
టిడిపి పార్టీ పెట్టాక అధికారంలోకి రావడం ఎన్టీఆర్ తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు అంతా తానై నడిపించే ప్రయత్నం చేయడం సంక్షేమ పధకాలు తీసుకురావడం అన్ని టచ్ చేసారు. చంద్రబాబు పాత్ర పోషించిన రానాతో చెప్పేవాడు లేకపోతే ఆరు కోట్ల మందున్నా ఎన్టీఆర్ ఒంటరైపోతాడు అని చెప్పించడం మొత్తం పొలిటికల్ డ్రామాతో నింపేశారు. బసవతారకం చికిత్స కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ పరిణామాలు ఎలా మారిపోయాయో కూడా చూపించారు.
అంచనాలకు తగ్గట్టే మహానాయకుడు మొత్తం రాజకీయంతో నిండిపోయింది. చంద్రబాబు కన్నా సచిన్ కెద్కర్ వేసిన నాదెండ్ల భాస్కర్ రావు పాత్ర ఎక్కువ నెగటివ్ షేడ్స్ లో ఉన్నట్టు కనిపించింది. ఇందిరా గాంధీని కూడా చూపించేసారు. ఒక సీన్ లో కృష్ణుడి కటౌట్ చూసి ఆమె దండం పెట్టుకుంటే పక్కనే ఉండే అసిస్టెంట్ అతను మన అపోజిషన్ పార్టీ అని చెప్పడం లాంటి అతిశయోక్తులు కూడా ఉన్నాయి. మొత్తానికి మహానాయకుడు ఎన్టీఆర్ రాజకీయంతో నిండిపోయింది. కీరవాణి సంగీతం బాగా ఎలివేట్ అయ్యింది. బాబుని ఎక్కువ ప్రొజెక్ట్ చేయకుండా క్రిష్ సేఫ్ గేమ్ ఆడాడు.
ఇటీవల విడుదలైన మొదటి భాగం ఎన్టీఆర్కథానాయకుడు బాక్సాఫీస్ వద్ద పూర్తిగా నిరాశపరచడంతో ఈ రెండవ భాగం ను ఎలాంటి హడావుడి లేకుండా ఈనెల 22 న విడుదల చేయనున్నారు. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నా ఈ చిత్రాన్ని ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ ,విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.