ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీ పాకిస్తాన్ గొప్పదనం ఏంట్రా: యాంకర్ రష్మీ

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 17, 2019, 11:25 AM



దేశం వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కదిలించిన పుల్వామ ఉగ్రదాడిని అంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇంతటి ఘాతుకంకు పాల్పడ్డ పాకిస్తాన్ ను నామరూపాలు లేకుండా చేయాలని ప్రతి ఒక్క భారతీయుడు రక్తం మరిగి పోతుంది. 40 మంది వీర జవాన్ లకు దేశ వ్యాప్తంగా ఘన నివాళ్లు సమర్పించారు. ఇదే సమయంలో కొందరు ఉగ్ర దాడిని సమర్ధిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. ఇండియాలో ఉంటూ ఉగ్ర దాడిని సమర్ధించిన వారిపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. యాంకర్ రష్మీ కూడా ఉగ్రదాడికి అనుకూలంగా మాట్లాడిన వారిపై ఉగ్రరూపం దాల్చి మరీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది.

సోషల్ మీడియాలో ఒక వ్యక్తి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పోస్ట్ చేశాడు. దాంతో అతడిపై రష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నువ్వు మావాడివి అయ్యావు కాబట్టి బతికి పోయావు - నీ పాకిస్తాన్ గొప్పదనం ఏంట్రా -దేశ విభజన సమయంలో నువ్వు అవతలి వైపు వెళ్లాల్సింది. మాతోనే మీకు అస్థిత్వం. మూసుకుని కూర్చో అంటూ ట్వీట్ చేసింది. పాకిస్తాన్ జిందాబాద్ అన్న నువ్వు ఈ దేశానికి ఎలా మొహం చూపుతావు వెళ్లి పాకిస్తాన్ లో ఎలుక పొక్కలో మొహం పెట్టుకో అంది.

పుల్వామ దాడికి తెగబడిన ప్రతి ఒక్కరిని కూడా నామ రూపాలు లేకుండా ఏరి వేయాలి. ఇలాంటి నా కొడుకులను ఏం చేసినా పాపం లేదు అంటూ ఆగ్రహంతో ట్వీట్స్ చేసింది. ఉగ్రవాదులకు అనుకూలంగా స్పందించిన వారిపై ఇప్పటికే కేసులు నమోదు అయ్యాయి. నవజోత్ సింగ్ సిద్దు వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. ఇలాంటి విమర్శలు చేసిన వారిని దేశ బహిష్కరణ చేయాలంటూ డిమాండ్ వినిపిస్తుంది. రష్మీ ఉగ్రవాదులపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతూ చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com