యంగ్ టైగర్ ఎన్టీఆర్ అటు సినిమాలతో పాటు ఇటు పలు సంస్థలకు అంబాసిడర్గా కూడా దూసుకుపోతున్నారు. ఇది వరకు బోరోప్లస్, నవరత్న ఆయిల్, మలబార్ గోల్డ్, సెలెక్ట్ మొబైల్స్ వంటి సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరించిన ఆయన ఇప్పుడు మరొక బ్రాండ్ కోసం పనిచేయనున్నారు. పార్లే ఆగ్రో కంపెనీ తమ పాపులర్ ప్రోడక్ట్ యాపీ ఫిజ్ అడ్వర్టైజింగ్ కోసం తారక్ ను సెలెక్ట్ చేసుకుంది. తారక్ సౌత్ ఇండియా రీజియన్ మొత్తానికి ప్రచారకర్తగా ఉండనున్నారు. ఇకపోతే ఉత్తరాదిలో ఈ ప్రొడక్టును బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రమోట్ చేస్తున్నారు.