ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకే రోజు ఒకే హీరో కి సంభందించిన రెండు సినిమాలు విడుదల

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 13, 2019, 05:16 PM



సినిమా ఇండస్ట్రీలో ఒకే రోజు ఒకే హీరో కి సంభందించిన రెండు సినిమాలు విడుదల అవడం చాల అరుదుగా జరుగుతుంటుంది. ప్రస్తుతం పరిస్థితులలో ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే విడుదల చేస్తున్న తరుణంలో యంగ్ హీరో రామ్ కార్తిక్ ఒకే రోజున రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన నటించిన ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’, ‘మౌనమే ఇష్టం’ చిత్రాలు మార్చి 15 న విడుదల అవుతున్నాయి.

కాగా రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో కిషోర్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న హారర్ కామెడీ చిత్రం వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి ఒకటి కాగా, మౌనమే ఇష్టం లాంటి యూత్‌ ఫుల్‌ లవ్ ఎంటర్‌టైనర్‌ చిత్రం మరొకటి, ఈ రెండు సినిమాలతో వస్తోన్న రామ్ కార్తిక్ హీరోగా ఎంతవరకు సక్సెస్ సాధిస్తాడో చూడాలి.

దాదాపు 150 సినిమాలకుపైగా ఆర్ట్‌ డైరెక్టర్‌గా పని చేసి, 5 నంది అవార్డ్స్‌ గెలుచుకున్న అశోక్‌ కుమార్‌ తొలిసారి ‘మౌనమే ఇష్టం’ సినిమా కు దర్శకత్వం వహిస్తుండడం విశేషం. మౌనమే ఇష్టం సినిమా లో రామ్ కార్తీక్ సరసన పార్వతి అరుణ్, రీతూచౌదరి హీరోయిన్లుగా నటించారు. ఇక వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి లో రామ్ కార్తీక్ సరసన పూజిత పొన్నాడ నటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com