అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా తర్వాత విజయ్ నటిస్తున్న చిత్రం 'డియర్ కామ్రేడ'. రష్మిక మందన్న హీరోయిన్. కొత్త దర్శకుడు భరత్ కమ్మ డైరెక్టర్ చేస్తున్న ఈ చిత్రాన్ని భారీ చిత్రాల సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేయగా అంచనాలు మరింత పెరిగాయి.
గీత గోవిందం' తర్వాత రష్మిక-విజయ్ కలిసి నటిస్తున్న రెండో చిత్రం ‘డియర్ కామ్రేడ్'. అప్పట్లో గీత గోవిందం సినిమా రిలీజ్ ముందు రష్మిక-విజయ్ ముద్దే సీన్ లీక్ అవ్వడం సంచలనం అయింది. అయితే సిినమాలో మాత్రం ఆ సీన్ లేకుండా చేశారు. అయితే ‘డియక్ కామ్రెడ్'లో ఇద్దరి మధ్య ఘాటైన రొమాంటిక్ సీన్స్ ఉంటాయని తాజాగా విడుదలైన టీజర్ బట్టి స్పష్టమవుతోంది.
Here's the #VijayDeverakonda's #DearComrade Kannada teaser - https://t.co/UWKMy2qYrq#DearComradeTeaser @TheDeverakonda @iamRashmika @bharatkamma @MythriOfficial @LahariMusic @bigbencinemas @YashBigBen
— Lahari Music (@LahariMusic) March 17, 2019