ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటు వేయడానికి మైసూర్ నుండి హైదరాబాద్ కి బయలుదేరిన రామ్ చరణ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2023, 06:47 PM



సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'గేమ్ ఛేంజర్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఇటీవలే మైసూరులో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా చరణ్ కూడా మైసూర్‌లో షెడ్యూల్‌ లో జాయిన్ అయ్యాడు.


తాజాగా ఇప్పుడు నవంబర్ 30న జరగనున్న తెలంగాణ ఎన్నికలలో ఓటు వేయటానికి రామచరణ్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. మైసూరు విమానాశ్రయంలో కనిపించిన రామ్ చరణ్, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు సినిమా షూటింగ్ షెడ్యూల్ నుండి విరామం తీసుకుని హైదరాబాద్‌కు ప్రైవేట్ విమానంలో బయలుదేరారు.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. అరవింద్ స్వామి, ఎస్‌జే సూర్య, సురేష్ గోపి, ఈషా గుప్తా, అంజలి, శ్రీకాంత్, జయరామ్, సునీల్, హ్యారీ జోష్ మరియు నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. 2024 సమ్మర్‌లో ఈ సినిమా పెద్ద స్క్రీన్‌లపైకి వచ్చే అవకాశం ఉంది. ఈ మెగా చిత్రానికి థమన్ ఎస్ సౌండ్‌ట్రాక్స్ అందించనున్నారు. దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com