మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన 'ఖైదీ నం 150' ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి గారు స్వాతంత్ర్య సమరయోధుడు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా 'సై రా నరసింహారెడ్డి ' తో వస్తున్నారు.
ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం ఫై భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయన తార కథానాయికగా నటిస్తుండగా , జగపతి బాబు , తమన్నా, విజయ్ సేతుపతి, సుధీప్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా జరుగుతున్న షెడ్యూల్ లో తన పాత్ర తాలూకు షూటింగ్ ను పూర్తి చేశాడు బిగ్ బి అమితాబ్ బచ్చన్. ఈ చిత్రంలో ఆయన చిరు కి గురువుగా నటిస్తున్నారు. ఈచిత్రం ఈ ఏడాది ద్వితీయార్థం లో విడుదలకానుంది.