ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కనీసం ఇప్పుడైనా నోరు విప్పండి : వరలక్ష్మి శరత్‌కుమార్‌

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 17, 2019, 01:26 PM



హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి ఆపై సామాజిక అంశాలపైనా ఎక్కువగా దృష్టి సారించే నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, ఆకృత్యాలను అడ్డుకునేందుకు తన వంతుగా ‘సేవ్‌ శక్తి’ పేరుతో ఆమె ఒక స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తమిళనాట కలకలం రేపుతున్న పొల్లాచ్చి కీచకపర్వంపై ఆమె స్పందిస్తూ.. సభ్యసమాజం తలదించుకునేలా సంభవించిన పొల్లాచ్చి దారుణాన్ని వివిధ వర్గాల ప్రజలు ఖండిస్తున్నారని, అయితే సినీ పరిశ్రమలోని అగ్రతారలు ఎవ్వరూ ఈ విషయంపై నోరు మెదపకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. శక్తివంతమైన వ్యక్తులకు అంతకుమించిన బాధ్యత కూడా వుండాలని, తమ మాటలతో సమాజంపై ప్రభావం చూపగల హీరోలు స్పందించకపోతే ఎలా అని ప్రశ్నిస్తూ.. ‘మీటూ’ ఉద్యమంలో ఎలాగూ మాట్లాడలేదు, కనీసం ఇప్పుడైనా నోరు విప్పండి అన్న భావనలో వరలక్ష్మి చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com