టాలీవుడ్ లో విలక్షణమైన దర్శకులలో 'రామ్ గోపాల్ వర్మ' ఒకరు. అతను ప్రత్యేకించి దృష్టి పెట్టి తీస్తున్న చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జీవితం ఆధారంగా తెరకేక్కిస్తున్నాడు. అయితే ఈ చిత్రం కి పలు సెన్సార్ అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డుపై కేసు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఏపీలో తొలిదశ పోలింగ్ ముగిసేవరకూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా సెన్సారింగ్ ను వాయిదా వేస్తామని బోర్డు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సెన్సార్ బోర్డుకు కేవలం సర్టిఫికెట్ జారీచేసే అధికారం మాత్రమే ఉందనీ, సినిమా సర్టిఫికేషన్ ప్రక్రియను వాయిదా వేసే అధికారం లేదని స్పష్టం చేశారు. సెన్సార్ బోర్డు తన సినిమాను చట్టవిరుద్ధంగా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. ఈ మేరకు వర్మ ట్విట్టర్ లో స్పందించారు.