బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న చిత్రం ‘సాహో. ’సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ లతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు.
‘సాహో’ సినిమా యొక్క షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఇక ఈ సినిమాలో లో తమిళ హీరో అరుణ్ విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఆయన తన పాత్ర తాలూకు షూటింగ్ ను కంప్లీట్ చేశారు.ఈ చిత్రం తెలుగు తో పాటు హిందీ,తమిళ భాషల్లో ఆగస్టు 15న విడుదలకానుంది.