గతేడాది విజయవంతంగా పూర్తి చేసింది సమంత. తన నుండి వచ్చిన 'మహానటి', 'యూ టర్న్','రంగస్థలం' భారీ విజయాల్ని అందుకున్నాయి. అలాగే ఈ సంవత్సరం 'మజిలీ' సినిమాతో రాబోతుంది. పెళ్లి అయిన తర్వాత నాగచైతన్య-సమంత నుంచి వస్తున్న మొదటి సినిమా కాబట్టి ప్రేక్షకులకు మామూలుగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యాక మాత్రం ఆ అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
ఏప్రిల్ 5వ తేదీన 'మజిలీ' విడుదల అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ సినిమా యూనిట్ ప్రమోషన్ వేగం పెంచింది. అందులో భాగంగా తాజా ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను గురించి కూడా ప్రస్తావించింది.తాను ఎప్పుడు తల్లిని అవతానో ఇప్పుడే చెప్పలేనని.. కానీ బిడ్డను కన్నాక మాత్రం కొన్నేళ్లు తనే సర్వస్వంగా బతుకుతానని.. సినిమాల జోలికి వెళ్లనని సమంత స్పష్టం చేసింది. ఈ సందర్భంగా తన బాల్యం అంత బాగా గడవలేదని.. కాబట్టి తన బిడ్డకు మంచి బాల్యం ఇవ్వాలనుకుంటున్నట్లు సమంత చెప్పడం గమనార్హం. ‘‘నాకు బిడ్డ పుడితే.. తనే నా ప్రపంచం అవుతుంది. నా బాల్యం అంత సజావుగా గడవలేదు. ఇలాంటి కోవకు చెందిన వారిని ఎవరిని కదిపినా.. ‘నేను పొందలేని దాన్ని నాకు పుట్టబోయే బిడ్డకు ఇవ్వాలి అనుకుంటున్నా’ అనే చెబుతారు. నేనూ అంతే. కాబట్టి నాకు బిడ్డ పుట్టిన కొన్నేళ్లు మాత్రం అన్నింటికీ దూరంగా ఉంటా. ఆ బిడ్డే నా సర్వస్వం అవుతుంది’’ అని సమంత స్పష్టం చేసింది. కాబట్టి తల్లి అయితే సమంత సినీ కెరీర్ దాదాపు క్లోజ్ అనుకోవచ్చు..