భరత్ అనే నేను సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు మహేష్ బాబు. దాదాపు ఈ సినిమా 150 కోట్ల కలెక్షన్స్ రాబట్టిందని సమాచారం. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ వంశీ పైడిపల్లి దర్శకత్వం లో మహర్షి సినిమా చేస్తున్నాడు. మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హరోయిన్లుగా నటిస్తున్న టాలీవుడ్ మోస్ట్ ఎగ్జైటింగ్ మూవీ ‘మహర్షి’ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ప్రమోషన్స్ వర్క్స్ని వేగవంతం చేశారు. ఈ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమా తరువాత మహేశ్ బాబు .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో మహేశ్ బాబు ఎలా కనిపించనున్నాడు? అనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఈ సినిమాలో మహేశ్ బాబు దేశభక్తుడిగా కనిపించనున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. మిలటరీ అధికారిగా పనిచేసే హీరో .. సెలవులకి తన ఊరికి వచ్చిన దగ్గర నుంచి కథ మొదలవుతుందని అంటున్నారు.