బెంగుళూరులోని ఓ లగ్జరీ హోటల్లో కొన్ని రోజుల పాటు బస చేసి.. బిల్లు దాదాపు రూ.4.5 లక్షలు అయ్యిందని తెలుసుకోగానే ఓ సినీ నటి అక్కడి నుంచి పారిపోయిందట. దీంతో హోటల్ యాజమాన్యం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రముఖ కన్నడ నటి పూజా గాంధీ బెంగుళూరులోని ఓ లగ్జరీ హోటల్లో దిగింది. ఆమె కొన్ని రోజుల పాటు ఆ హోటల్లో బస చేయడంతో బిల్లు దాదాపు రూ.4.5 లక్షలు అయింది. విషయం తెలుసుకున్న పూజా హోటల్ నుంచి పారిపోయింది. దీంతో హోటల్ యాజమాన్యం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పూజాకు పోలీసులు సమన్లు జారీ చేశారు. అయితే తాను రూ.2 లక్షలు చెల్లించానని.. మిగిలినవి కాస్త గడువిస్తే చెల్లిస్తానని హోటల్ యాజమాన్యాన్ని కోరినట్టు తెలుస్తోంది. దీంతో హోటల్ యాజమాన్యం కూడా ఆమెకు గడువిచ్చినట్టు తెలుస్తోంది.