నిన్న తిరుపతి శ్రీ విద్యానికేతన్ విద్య సంస్థలో మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కమెడియన్ అలీని మోహన్ బాబు గారు సత్కరించారు.తండ్రి పుట్టినరోజు సందర్బంగా హీరో విష్ణు తన ఉదారతను చాటుకున్నాడు. తిరుపతిలోని రుయా ఆసుపత్రికి కోటి రూపాయల భారీ విరాళం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ ఆసుపత్రిలో సౌకర్యాలను మెరుగుపరిచే నిమిత్తం ఈ విరాళం ఇస్తున్నట్టు తెలిపారు. ఈ విరాళం మొత్తాన్ని మూడేళ్ల కాలంలో అందజేస్తానని ఓ ట్వీట్ లో విష్ణు పేర్కొన్నారు.