‘మన్మథుడు’ సినిమా వచ్చిందంటే టీవీలకు అతుక్కుపోయే వాళ్లున్నారు. సీక్వెల్ అంటే ఎంత కష్టమో ఆలోచించండి. కానీ నాగార్జున ఆ వైపుగా ఆలోచించడమే కాదు.ఇపుడు సినిమాకు సీక్వెల్కు ‘మన్మథుడు 2’ మూవీ లాంచ్ ప్రారంభమయ్యారు.రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మథుడు 2’ సెట్స్ మీదికి వెళ్లింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'మన్మధుడు 2 ' షూటింగ్ ఈ రోజు ప్రారంభమైంది. సీనియర్ రైటర్ సత్యానంద్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కి స్క్రిప్ట్ ని అందించగా, అమల అక్కినేని ఫస్ట్ క్లాప్ ఇచ్చారు. యువ సామ్రాట్ నాగ చైతన్య కెమెరా స్విచాన్ చేయగా మొదటి షాట్ని దేవుని పటాలపై చిత్రీకరించారు.
సుమంత్, సుశాంత్, నాగ సుశీల, యార్లగడ్డ సురేంద్ర ఇంకా అక్కినేని కుటుంబసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారం రోజులు హైదరాబాద్ షెడ్యూల్ జరుపుకున్నాక చిత్ర యూనిట్ పోర్చుగల్ వెళ్తుంది. అక్కినేని నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. చి || ల || సౌ చిత్రాన్ని నాగార్జున చూసి మెచ్చుకుని అన్నపూర్ణ ద్వారా రిలీజ్ చేశారు. ఆ చిత్రాన్ని చూసినప్పుడే ఆయన నాతో సినిమా చేస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నాకు ఈ చిత్రాన్ని చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అన్నారు.