లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 29న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. పి.విజయ్కుమార్, యజ్ఞశెట్టి, శ్రీతేజ్ ప్రధాన పాత్రధారులుగా రాంగోపాల్వర్మ, ఆగస్త్య మంజు దర్శకత్వంలో రాకేష్రెడ్డి, దీప్తి బాలగిరి సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. ఎన్నికల సమయంలో ఈ చిత్రం విడుదలవుతుండటంతో ఇందులో వివాదస్పద అంశాలున్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ మేరకు ఎన్నికల కమీషన్కు ఫిర్యాదులు అందాయి. దాంతో నిర్మాత రాకేష్రెడ్డి సినిమా గురించి వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సెన్సార్ పూర్తయి, చిత్రానికి యు సర్టిఫికెట్ లభించిందని, దాంతో చిత్రం విడుదలకు మార్గం సుగమమైందని చిత్ర సంబంధీకులు తెలిపారు.