ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సెన్సార్ పూర్తి..

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 26, 2019, 12:05 PM



లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 29న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ జీవితంలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. పి.విజయ్‌కుమార్‌, యజ్ఞశెట్టి, శ్రీతేజ్‌ ప్రధాన పాత్రధారులుగా రాంగోపాల్‌వర్మ, ఆగస్త్య మంజు దర్శకత్వంలో రాకేష్‌రెడ్డి, దీప్తి బాలగిరి సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. ఎన్నికల సమయంలో ఈ చిత్రం విడుదలవుతుండటంతో ఇందులో వివాదస్పద అంశాలున్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ మేరకు ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదులు అందాయి. దాంతో నిర్మాత రాకేష్‌రెడ్డి సినిమా గురించి వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సెన్సార్‌ పూర్తయి, చిత్రానికి యు సర్టిఫికెట్‌ లభించిందని, దాంతో చిత్రం విడుదలకు మార్గం సుగమమైందని చిత్ర సంబంధీకులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com