ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లు అర్జున్ తో వచ్చిన పుకార్లపై పై స్పందించిన సాయి ధరమ్ తేజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2019, 03:51 PM



మెగా మేనల్లుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన 'సాయిధరమ్ తేజ్' తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదటగా వరుస హిట్స్ కొట్టిన తేజ్ మధ్యలో వరుస ప్లాపులతో సతమతం అయ్యాడు. ఇక తాజాగా వచ్చిన 'చిత్రలహరి' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.ఇక ఈ సినిమాతో సాయి మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. అయితే సాయి ధరమ్ కి  రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన ప్రశ్ ఎదురయింది. 'మీకు .. బన్నీకి మధ్య మనస్పర్థలు వున్నాయనే టాక్ వుంది. ఇందుకు మీ సమాధానం ఏమిటి?' అని అడగ్గా , ఆయన దానిపై స్పందిస్తూ .. 'మెగా ఫ్యామిలీలో నేను చరణ్ .. వరుణ్ తేజ్ లతో ఎక్కువ చనువుగా వుంటాను. ఇక స్టైలింగ్ కి సంబంధించిన సలహాలు . . సూచనల కోసం బన్నీని కలుస్తుంటాను.మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు .. అందరం కలిసిపోయే ఉంటాము. చిన్నప్పటి నుంచి మేమంతా కలిసి పెరిగిన వాళ్లం. పండుగలన్నీ కలిసే జరుపుకున్న వాళ్లం. 



రామ్ చరణ్ .. బన్నీ బయట స్టార్స్ అయినా, ఇంటికి వెళితే ఆ స్టార్ డమ్ ను పక్కన పెట్టేసి ఎప్పటిలానే హ్యాపీగా మాట్లాడతారు. నాకు .. బన్నీకి మధ్య మనస్పర్థలు అనే మాట ఇండస్ట్రీలో షికారు చేస్తుందంటే అదంతా పుకారేగానీ, అందులో ఎంతమాత్రం వాస్తవం లేదు' అని చెప్పుకొచ్చాడు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com