పూరి ఇంట్లో విషాద ఛాయలు నెలకొన్నాయి..అరే ఎవరు చనిపోయారు..అని ఖంగారు పడుతున్నారా..చనిపోయింది మనిషి కాదు తన పెంపుడు కుక్క. అవును పూరి జంతు ప్రేమికుడు అనే సంగతి తెలిసిందే. ఆయన ఇంట్లో డజన్ల కొద్దీ పెంపుడు కుక్కలు..పక్షులు ఉంటాయి. వాటిని పెంచడం కోసం వేల ఖర్చు చేస్తారు. తాజాగా ఆయన ఎంతో ఇష్టంగా పెంచుకునే కుక్క జాక్స్ చనిపోయిందట. చాలా సంవత్సరాలుగా తన వద్ద పెరుగుతున్న జాక్స్ మరణం పూరిని బాగా ఇబ్బంది పెడుతున్నట్లుగా ఆయన పోస్ట్ చేసారు.పూరి జాక్స్ తో తన అనుబంధాన్ని ట్విట్టర్ లో పంచుకున్నాడు.. వీడి పేరు జాక్స్ – ఎప్పుడు నాతోనే ఉండేది. ఒకానొక సమయంలో వీడిని పెంచే పరిస్థితి లేక నా ఫ్రెండుకి ఇచ్చేశాను. 5 సంవత్సరాల తర్వాత మళ్లీ తీసుకు వచ్చాను. కాని వాడు హర్ట్ అయ్యి అప్పటి నుండి నాతో మాట్లాడటం మానేశాడు. దగ్గరకు రాడు – నావైపు చూడడు – తోక కూడా ఊపి ఇప్పటికి 8 ఏళ్లు అయ్యింది. నేను లైఫ్ లో ఎంత మందిని బాధ పెట్టానో నాకు తెలియదు – కాని వీడిని మాత్రం చాలా బాధ పెట్టాను. వాడు ఇంక లేడు ఈరోజు వాడికి చివరి రోజు అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. పూరి ఎమోషనల్ ట్వీట్ కు పెద్ద ఎత్తున సెలబ్రెటీలు మరియు అభిమానులు స్పందించారు. ప్రస్తుతం పూరి హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేస్తున్నాడు.