‘‘ఎంత యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నప్పటికీ తొలిసారి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నాకు కాస్త బెరుగ్గానే అనిపిస్తుంది. స్థానికులు చూపించే ఆదరణని బట్టి ఆ బెరుకు నిదానంగా తగ్గుతుంది’’ అని కియారా అడ్వాణీ అన్నారు. తెలుగులో మహేశ్ సరసన ‘భరత్ అనే నేను’, రామ్చరణ్ సరసన ‘వినయ విదేయ రామ’లో నటించారు కియారా. ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’లో ప్రీతీ పాత్రలో ఆమె నటిస్తున్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి ఇటీవల ఆమె నాసిక్కు వెళ్లారు. ఆ అనుభవాల గురించి ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ‘‘నాసిక్లో తొలిసారి అడుగుపెట్టాను. స్థానికులు ఆహ్వానించిన తీరు మర్చిపోలేను. కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడివారు చిరునవ్వుతో స్వాగతిస్తే ఆ అనుభూతి మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది’’ అని తెలిపారు. తనకు ఎంతో నచ్చితే తప్ప సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేయనని ఆమె ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. ‘కబీర్ సింగ్’ జూన్ 21న విడుదల కానుంది.