ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరునవ్వుతో స్వాగతిస్తే ఆ అనుభూతి మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2019, 08:46 AM



 ‘‘ఎంత యాక్టింగ్‌ ఫీల్డ్‌లో ఉన్నప్పటికీ తొలిసారి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నాకు కాస్త బెరుగ్గానే అనిపిస్తుంది. స్థానికులు చూపించే ఆదరణని బట్టి ఆ బెరుకు నిదానంగా తగ్గుతుంది’’ అని కియారా అడ్వాణీ అన్నారు. తెలుగులో మహేశ్‌ సరసన ‘భరత్‌ అనే నేను’, రామ్‌చరణ్‌ సరసన ‘వినయ విదేయ రామ’లో నటించారు కియారా. ‘అర్జున్‌ రెడ్డి’ హిందీ రీమేక్‌ ‘కబీర్‌ సింగ్‌’లో ప్రీతీ పాత్రలో ఆమె నటిస్తున్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి ఇటీవల ఆమె నాసిక్‌కు వెళ్లారు. ఆ అనుభవాల గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ‘‘నాసిక్‌లో తొలిసారి అడుగుపెట్టాను. స్థానికులు ఆహ్వానించిన తీరు మర్చిపోలేను. కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడివారు చిరునవ్వుతో స్వాగతిస్తే ఆ అనుభూతి మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది’’ అని తెలిపారు. తనకు ఎంతో నచ్చితే తప్ప సోషల్‌ మీడియాలో ఫొటోలు పోస్ట్‌ చేయనని ఆమె ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. ‘కబీర్‌ సింగ్‌’ జూన్‌ 21న విడుదల కానుంది.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com