తల అజిత్ సినిమాల కోసం అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తుంటారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పింక్ రీమేక్గా ఖాకీ ఫేం హెచ్ వినోథ్ దర్శకత్వంలో నెర్కొండ పార్వాయి అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. అయితే సంక్రాంతి కానుకగా విడుదలైన అజిత్ చివరి చిత్రం విశ్వాసం మరో మైల్ స్టోన్ అందుకుంది. జనవరి 11న విడుదలైన ఈ చిత్రం నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంది. తమిళనాడులోని పలు థియేటర్లో ప్రస్తుతం ఈ చిత్రం సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లు రాబట్టిన ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషలలోను విడుదల చేశారు . అక్కడ కూడా ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. విశ్వాసం చిత్రంలో నయనతార కథనాయికగా నటించగా, జగపతి బాబు ముఖ్య పాత్ర పోషించాడు.