ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మహర్షి' నుండి మరో పాట విడుదల

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2019, 05:29 PM



మహేశ్ బాబు 25వ చిత్రంగా 'మహర్షి' నిర్మితమైంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మే 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ఒక సాంగ్ ను విడుదల చేశారు. "ఎవరెస్టు అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే" అంటూ ఈ పాట సాగుతోంది.

చాలా రిచ్ గా .. స్టైలీష్ గా ఈ సాంగ్ ను చిత్రీకరించారు. ఈ పాటలోను మహేశ్ బాబు డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట కొత్తగా .. యూత్ కి కనెక్ట్ అయ్యేలా వుంది. దిల్ రాజు .. అశ్వనీదత్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమా కోసం మహేశ్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో మహేశ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరిపోవడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com