‘ఎంఎస్. ధోని’ సినిమాతో ఆకట్టుకున్న అందాలభామ కైరా అద్వాని. టాలీవుడ్ తొలి అడుగు సూపర్స్టార్ మహేష్బాబు ‘భరత్ అనే నేను’తో పడింది. ఆ తర్వాత ‘వినయ విధేయ రామ’లో నటించింది. రెండు కమర్షియల్గా భారీ సినిమాలు. ఒకేసారి సక్సెస్, ఫెయిల్యూర్స్ కైరాకు ఎదురయ్యాయి. దాంతో టాలీవుడ్లో కొత్త అవకాశాలు కాస్త నెమ్మగించాయి. ఇదే టైమ్లో బాలీవుడ్లో మాత్రం బిజీగా ఉంది. తెలుగు సూపర్హిట్ సినిమా అర్జున్రెడ్డి రీమేక్ హిందీ చిత్రం కబీర్సింగ్లో నటిస్తోంది. ఐదేళ్ళలో నటించింది కేవలం ఏడు సినిమాలు మాత్రమే అంటే ఆమె కెరీర్ ఎంత నెమ్మదిగా సాగుతోందో అర్థమవుతోంది. తరచుగా విదేశీ ప్రయాణాలు చేసే కైరా తాజాగా ఓ తెలుగు సినిమా కమిటైనట్టు తెలిసింది. అక్కినేని వారి అబ్బాయి అఖిల్ నటిస్తున్న చిత్రంలో కైరాను హీరోయిన్గా ఎంపికచేసినట్టు సమాచారం. వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న అక్కినేని వారసుడికి సక్సెస్ ఇచ్చే బాధ్యతను ప్రముఖ నిర్మాత గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ స్వీకరించారు. బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్ దర్శకత్వంలో ఆయన నిర్మించే చిత్రంలో అఖిల్ సరసన కైరా నటిస్తుందని తెలిసింది. దీనికి సంబంధించిన అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు.