ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాంకర్ రష్మికి కోపమొచ్చిసింది

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 20, 2019, 06:16 PM



యాంకర్ రష్మికి కోపమొచ్చిసింది.. ఆ నా కొడుకుల్ని నరికి పారేయాలంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. ఇంతకీ రష్మికి కోపం తెప్పించింది ఎవరనే కదా మీ డౌటనుమానం. ఆడవాళ్లపై అత్యాచారాలకు పాల్పడే మృగాళ్లు. బీహార్‌లో ఓ మహిళపై జరిగిన అత్యాచార ఘటనపై స్పందిస్తూ కాస్త ఘాటుగా ట్వీట్ చేశారు.. తన బాధ, ఆవేదనను తెలియజేశారు. 


‘ప్రతిరోజూ కొత్త కేసు నమోదవుతూనే ఉంది. గతంలో జరిగిన సంఘటనల కంటే.. ఇప్పుడు జరిగేవి ఎంతో భయానకంగా ఉంటున్నాయి. మగాళ్లమని భావిస్తూ, అఘాయిత్యాలకు పాల్పడేవాళ్లను పట్టుకొని కోసిపారేయాలి.. లేకపోతే ఒక్క రాత్రిలోనే ఆడదన్నది కనిపించకుండా పోతుంది. అప్పుడు కానీ ఈ మానవాళికి, సమాజానికి ఆడవాళ్లా విలువ తెలుస్తుంది’ అన్నారు. 


బీహార్‌లో ఓ యువతిపై నలుగురు యువకులు అత్యాచారానికి ప్రయత్నించారు. ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో.. ఆ నలుగురు యువకులు ఆమెపై యాసిడ్‌ దాడి చేశారు. ఈ ఘటనపైనే రష్మి స్పందించింది. ఆమె ట్వీట్‌కు నెటిజన్లు మద్దతు పలికారు. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com